ఇంద్రకీలాద్రిలో కొబ్బరికాయల కాంట్రాక్ట్కు రికార్డు బిడ్.. ఆలయానికి భారీ ఆదాయం
రూ.1.36 కోట్లకు కొబ్బరికాయల కాంట్రాక్ట్ దక్కించుకున్న నాగ వైష్ణవి గత ఏడాదితో పోలిస్తే రూ.35 లక్షలకు పైగా అదనపు ఆదాయం పారదర్శక బహిరంగ వేలంతో ఆలయానికి పెరిగిన ఆదాయం
చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, జూలై 23 (వి10టివి):
ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మహా మండపం ఆరవ అంతస్తులో భక్తులు కొట్టిన కొబ్బరికాయల చిప్పలను సేకరించి బయటకు తరలించే కాంట్రాక్ట్కు నిర్వహించిన బహిరంగ వేలంలో రికార్డు స్థాయిలో రూ.1,36,50,000 బిడ్ నమోదైంది. ఈ కాంట్రాక్ట్ను నాగ వైష్ణవి దక్కించుకున్నారు.
ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో పూర్తిస్థాయి పారదర్శకతతో వేలం నిర్వహించారు.
గత ఏడాది ఇదే కాంట్రాక్ట్


ద్వారా ఆలయానికి రూ.1,01,44,200 ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.35 లక్షలకు పైగా అదనపు ఆదాయం లభించింది. పారదర్శక విధానాలు, పోటీ వాతావరణంలో నిర్వహించిన వేలం ద్వారా అమ్మవారి ఆలయానికి మరింత ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో ఆదాయం పెరిగేలా పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి ఇదే తరహా చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

