ప్రైవేట్ ట్రావెల్స్పై అర్ధరాత్రి పోలీసుల మెరుపు తనిఖీలు
బెంజ్ సర్కిల్ వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పటమట పోలీసులు.. భద్రతా ప్రమాణాలపై బస్సుల క్షుణ్ణంగా పరిశీలన.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ పవన్ కిషోర్ హెచ్చరిక..

విజయవాడ , జూలై 18 (v10tv):
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పటమట పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి బెంజ్ సర్కిల్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్లో బస్సుల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్ల లైసెన్సులు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు, భద్రతా పరికరాలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించేలా నిబంధనలు ఉల్లంఘించే ట్రావెల్స్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ పవన్ కిషోర్ హెచ్చరించారు.
